Sarkaru vari pata : సర్కారు వారి పాట సినిమా మీద ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 27 వ సినిమా గా సర్కారు వారి పాట భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద దుబాయ్ లో కీలకమైన సీన్స్ తో పాటు మహేష్ బాబు – ఫైటర్స్ మీద భారీ ఛేజింగ్ అండ్ యాక్షన్స్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. ఇక ఈ యాక్షన్స్ సీన్స్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ రాం – లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అదేమిటంటే దర్శకుడు పరశురామ్ .. మహేష్ బాబు ని హాలీవుడ్ హీరో లా చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం రీసెంట్ గా దుబాయ్ షెడ్యూల్ లో పాల్గొంటున్న మహేష్ బాబు లుక్స్ కొన్ని లీకవడమే. ఈ లుక్స్ అండ్ వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే గ్యారెంటీగా సర్కారు వారి పాట హాలీవుడ్ సినిమా కి మించి ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక సర్కారు వారి పాట కాన్సెప్ట్ కూడా యూనివర్సల్ కాబట్టి అందుకే రెండు భారీ షెడ్యూల్స్ ని దుబాయ్, అమెరికా లలో ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక మహేష్ బాబు లుక్ కూడా మహా క్లాసీగా ఉంటుందని ఇప్పటికే అర్థమైపోయింది.
Sarkaru vari pata : అయితే ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిస్తున్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది..!
కాగా సర్కారు వారి పాట బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా థమన్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్స్ మహేష్ బాబు కి డైరెక్టర్ పరశురామ్ కి వినిపించేందుకు వెళ్ళాడు. ఇక ఈ సినిమాని 14 రీల్ ప్లస్ .. మైత్రీ మూవి మేకర్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అధికారకంగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిస్తున్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది.