Sarkaru vari pata : సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దుబాయ్ లో నెల రోజుల భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ వారం నుంచి మరో నెల రోజుల లాంగ్ షెడ్యూల్ జరగబోతోంది. కీలకమైన సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేస్తున్నారు. పరశురాం పెట్లా దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా రాబోతోంది.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉంటుందని అటు పవర్ స్టార్ అభిమానులు ఇటు సూపర్ స్టార్ అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది.
Sarkaru vari pata : సర్కారు వారి పాట విజయ దశమి కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట..?
మహేష్ బాబు సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి కాకుండా ఈ ఏడాదిలోనే విజయ దశమి పండుగకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆగస్ట్ వరకు సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అందుకే సంక్రాంతి వరకు కాకుండా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే గనక నిజమైతే మహేష్ అభిమానులకి ఇది పండగ చేసుకునే వార్తే అని చెప్పాలి. కాగా సర్కారు వారి పాట కంప్లీట్ అవగానే రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు.