మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది తాప్సి పన్ను. తన అభినయం, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లి అక్కడ కూడా తనదైన ముద్రవేసి ఎన్నో మంచి మంచి ఆఫర్స్ ను దక్కించుకుని సక్సెస్ ఫుల్ నటిగా పేరు తెచ్చుకుంది. తాప్సీ స్క్రిప్ట్ ని ఎంచుకునేడప్పుడు సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తోంది. ప్రస్తుతం ఆమె ‘రష్మిక రాకెట్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో తాప్సి ఒక అథ్లెట్ పాత్రను పోషిస్తోంది.
ఇటీవల మాల్దీవుల కు విహారయాత్ర కోసం వెళ్లిన తాప్సీ అక్కడ ఆనందంలో మునిగిపోయింది. బికినీలో ఫొటోకు ఫోజులు ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ ఇక సినిమాల్లో బికినీ వేసేది లేదని తేల్చి చెప్పేసింది. తన బికినీ ఫొటోలు ఇకపై సోషల్ మీడియాకు రావని చెప్పింది తాప్సీ.
ఇకనుంచి ఆఫ్ స్క్రీన్కే తన బికినీ అందాలన్నీ పరిమితమని ప్రకటించింది. అభిమానులు తనను చిట్టిపొట్టి దుస్తుల్లో ఊహించుకోలేరని తాప్సీ చెప్పుకొచ్చింది. ‘జుద్వా’లో తప్ప మరే ఇతర సినిమాలోనూ తాను ఇప్పటి వరకూ బికినీలో కనిపించలేదని చెప్పింది.
అభిమానులు ఓవర్ ఎక్స్ఫోజింగ్ చేసినా తనను స్వీకరించరనే విషయం బాగా తెలుసన్నారు. ఇక మీదట సినిమాల్లో బికినీ ధరించకూడదనే గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తాప్సీ చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ ఫొటోల్ని కూడా షేర్ చేయడానికి తాను ఇష్టపడనని తేల్చి చెప్పేసింది తాప్సీ పన్ను.