Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి అవకాశాలిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత 5 ప్రాజెక్ట్స్ ఓకే చేశారు. పాన్ ఇండియన్ సినిమాగా సైరా వచ్చింది. ఆ తర్వాత ఆచార్య మొదలైంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా విడుదలలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోయి ఉంటే మేలో రిలీజ్ కావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. రాం చరణ్ మరొక హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఆచార్య సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.
ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ తెలుగు రీమేక్ చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ఈపాటికి చాలా వరకు పూర్తి కావాల్సింది. కానీ ఇంకా సెట్స్ మీదకే రాలేదు. అయితే రీసెంట్గా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. పరిస్థితులన్నీ అనుకూలిస్తే జెట్ స్పీడ్ లో మెగాస్టార్ – మొహన్ రాజాల సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే రెండు సినిమాలు చిరంజీవి నుంచి రావడం హాట్ టాపిక్ అవుతుంది.
Chiranjeevi : సోనాక్షి సిన్హా సౌత్ లో ఎంట్రీ ఇస్తుందా లేదా ..!
అంతేకాదు తర్వాత మెహర్ రమేష్, బాబీ సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా చిరంజీవి కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో కూడా సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వచ్చాయి. కానీ కుదరలేదు. మరి ఈసారైనా సోనాక్షి సిన్హా సౌత్ లో ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!