Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఏడవ వారం సన్నీ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే తరుణంలో 8వ వారం లో కూడా కెప్టెన్సీ పోటీదారుల లో సన్నీ స్థానం సంపాదించాడు. అయితే 8వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఫైనల్ స్టేజ్ లో… వెంటాడు వేటాడు అనే టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కెప్టెన్సీ పోటీదారులకి గోనెపట్ట లో ధర్మకోల్ బాల్స్ ఇచ్చి… ఓ రింగ్ లో నిలబెట్టారు. అయితే ఈ రింగులో మిగతా కంటెస్టెంట్ గోనెపట్ట లో ఉన్న ధర్మకోల్ మొత్తం ఖాళీ చేయాలని చివరాకరికి ఎవరు ఎదురౌతారో వాడే గెలిచినట్లు బిగ్ బాస్ ప్రకటన చేయడం జరిగింది. ఈ గేమ్ కి సంచాలకుడిగా జెస్సీని నియమించారు. ఈ క్రమంలో స్టార్టింగ్ లోనే శ్రీరామ్… సన్నీ(Sunny) ని టార్గెట్ చేసి అతని గోనెపట్ట లో ఉన్న బాల్స్ మొత్తం పడగొట్టేశాడు.
ఈ క్రమంలో సన్నీకి శ్రీరామ్ కి మధ్య బాగానే చాలా అతి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత సన్నీ పక్కకు వెళ్లిపోవడంతో మానస్… శ్రీరామ్ ని టార్గెట్ చేసి.. అతని గోనెపట్ట లో ఉన్న బాల్స్ మొత్తం పడేసాడు. ఈ క్రమంలో ఇద్దరు రింగ్ దాటి బయటకు వెళ్లడంతో సంచాలకుడిగా ఉన్న జెస్సీ.. వార్నింగ్ ఇచ్చిన కానీ ఇద్దరు దూకుడుగా ఆడటంతో.. ఇద్దరిని పక్కకు పంపించేశాడు. ఈ తరుణంలో.. సన్నీ సంచాలకుడిగా ఉన్న జెస్సీ కాలితో తన్నాడు. అసలు ఇప్పటికే దెబ్బతో బాధపడుతున్న జేసీ మరింత ముందుకు పోయి ఫుల్లు కోపంతో సన్నీ పైకి వెళ్ళాడు. దీంతో 53 వ రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్లో భారీగానే గొడవలు జరిగాయి.
సన్నీ.. శ్రీ రామ్ కి డైలాగులు వేశారు
ఇదిలా ఉంటే ఏడో వారం లో ప్రియ ఆంటీతో సన్నీ కి జరిగిన అతి పెద్ద గొడవ తర్వాత ఎనిమిదో వారం లో కూడా అదే రీతిలో జెస్సి.. శ్రీరామ్ తో.. గొడవ చేసుకోవటంతో ఈ ఎపిసోడ్ చూడటానికి బిగ్బాస్ ఆడియన్స్ ఆత్రుతగా ఉన్నారు. సీజన్ ఫైవ్ బిగ్బాస్(Bigg Boss) కంప్లీట్ అయిన కానీ నేను ఇక్కడే ఉంటా.. అంటూ సీరియస్ గానే సన్నీ(Sunny).. శ్రీ రామ్(Sri Ram) కి డైలాగులు వేశారు. మరోపక్క జెస్సీ మీదకి కొడతా కి సన్నీ వెళ్లడంతో జెస్సీ(Jessy) కూడా ఎక్కడా తగ్గకుండా సన్నీ మీద కి వెళ్ళాడు. దీంతో ఈ వారం ఇంటిలో ఎవరు కెప్టెన్ అవుతారన్నది చాలా సస్పెన్స్ గా ఉంది.