దేశంలో కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో పూరీ జగన్నాధ రథయాత్ర నిర్వహించడం సబబు కాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 23వ తేదీన రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా రథయాత్రపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.
భారతీయ వికాస్ పరిషత్ (బీవీపీ) దాఖలు చేసిన స్పెషల్లీవ్ పిటిషన్పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపిస్తోందని, రథయాత్ర నిర్వహిస్తే లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రజా రోగ్యానికి ఇది మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రథయాత్రకు సంభందించిన కార్యక్రమాలను తక్షణం ఆపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.