తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ రోజు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెళ్లారు. ఈ రోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయిస్తే .. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లాను, ప్రజలందరూ మాస్కులు ధరించాలి. టీకాలు వేయించుకోవాలి. ఇతర జాగ్రత్తలు పాటించాలి అంటూ మంగళవారం సీఎం స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ త్వరగా కొలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆక్షాంక్షించారు.
అయితే రెండు రోజులుగా తన నివాసంలోనే ఉండి చికిత్స పొందిన సీఎం స్టాలిన్ కు కోవిడ్ లక్షణాలు అధికం కావడంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తొంది. ఆసుపత్రి వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. పలువురు రాజకీయ నాయకులు సైతం మాస్కులు ధరించడం లేదు. రీసెంట్ గా జరిగిన ఏఐఏ డిఎంకే సమావేశంలోనూ చాలా మంది నేతలు మాస్కులు ధరించకుండానే పాల్గొన్నారు.
రవాణా వాహన యజమానులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ .. మ్యాటర్ ఏమిటంటే..?