Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలలో వైసిపి పార్టీ ముందంజలో ఉంది.
కానీ కొన్ని కీలక చోట్ల టిడిపి పార్టీ రాణించటం సంచలనంగా మారింది. ముఖ్యంగా టిడిపి పార్టీ అన్న గాని చంద్రబాబు నాయుడు అన్న గాని ఒంటి కాలి మీద విరుచుకు పడే మంత్రి కొడాలి నాని అడ్డా గుడివాడలో టిడిపి పార్టీ గెలిచినట్లు.. పసుపు జెండా రెపరెపలాడినట్లు ఏపీ మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో టిడిపి మద్దతు ఇచ్చిన అంశాన్ని అభ్యర్థి.. దాదాపు ఎనిమిది వందల ఓట్లు మెజార్టీతో సర్పంచ్ గా గెలుపొందడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో పెదపారుపూడి మండలంలో ఉన్న ఎలమర్రు గ్రామంలో 12వ వార్డులకు గాను 11వ వార్డు టిడిపి అభ్యర్థులు కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక్క వార్డుకు వైసిపి పరిమితమైంది. ఒక రకంగా చెప్పాలంటే మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో ఇది సరికొత్త దిమ్మతిరిగే షాక్ అని అంటున్నారు. టిడిపి పార్టీ ని భారీ స్థాయిలో విమర్శించడంతో.. జరిగిన పంచాయతీ ఎన్నికలలో టిడిపి శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కావాలని కొడాలి నాని ని ఓడించినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు గుడివాడ నియోజకవర్గంలో 20 పంచాయతీలలో 9 పంచాయితీలు టిడిపి పార్టీ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ నియోజకవర్గంలో కూడా టిడిపి పార్టీ ముందంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం రెండో దఫా పంచాయతీ ఎన్నికలలో వైసిపి మొదటి దశ ఎన్నికల మాదిరిగానే ముందంజలో ఉండటం జరిగింది. కానీ కీలకమైన చోట్ల టిడిపి పార్టీ గెలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.