అమరావతి: కశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు స్వాగతించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో బిల్లుకు మద్దతు కూడా తెలియజేశారు. అయితే ఆ పార్టీ విజయవాడ ఎంపి కేశినేని నాని దీనిపై విభిన్నంగా స్పందించారు.
బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కశ్మీర్కు, దేశానికి మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. కశ్మీర్తో తనకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందనీ, కశ్మీరీలు చూపించే ప్రేమ, అభిమానం, వినయ, విధేయతలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కశ్మీర్ ను భూతల స్వర్గంగా నాని అభివర్ణించారు.