అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన అనేది ఏ పార్టీకైనా ఇబ్బందే. ఒకరికి ఇచ్చి.. మరొకరికి మొండి చేయి చూపితే.. వ్యతిరేకత ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. అంతేకాదు.. అభ్యర్థుల ఎంపిక అనేది అశ్వమేధయాగం చేయడం కన్నా కూడా చాలా చాలా కష్టం. అది అన్ని పార్టీల్లోనూ ఉన్నదే. పైగా.. ఇక్కడ తేడా కొడితే.. మొత్తానికే మోసం వస్తుంది. ముందుగా విమర్శల బాణాలు.. రాళ్లు కాచుకుని కూ ర్చుంటాయి.
దీంతో పార్టీలన్నీ.. ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. మరీ ముఖ్యంగా టీడీపీ వంటి 45 ఏళ్ల సుదీర్ఘ చరి త్ర ఉన్న టీడీపీలో అయితే.. టికెట్ల కసరత్తు, ఎంపిక అనేది.. కత్తిమీద సాము చేయడమే. ఇలాంటి మహా యజ్ఞంలో ఎప్పటికప్పుడు పరీక్షలే. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చేవి. టికెట్ దక్కనివారు.. విమర్శలు గుప్పిస్తే.. దక్కిన వారు దండలు వేసేవారు. దీనిని గమనించిన ఎన్టీఆర్.. ముందుగానే టికెట్లు ప్రకటించే సంప్రదాయానికి తెరదించేశారు.
నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. నామినేషన్ల ఘట్టం జరుగుతున్న సమయంలో టికెట్లు ప్రకటించడం మొ దలు పెట్టారు. ఇలా.. వచ్చిన ఈ సంస్కృతికి తాజాగా చంద్రబాబు బ్రేక్ వేస్తూ.. రెండు మాసాల ముందుగా నే అభ్యర్థులను ఎంపిక చేశారు. 175 స్థానాలకు 94 టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. దీనిపైనా విమర్శ లు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు ఏం చూసి ఇచ్చారు? ఈ క్వేషన్లుఏంటి? అనే నిలదీతలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి సహజం కూడా.
అయితే.. చంద్రబాబు ఈ టికెట్ల ఎంపిక కోసం.. చాలానే కష్టపడ్డారని చెప్పారు. మూడు స్థాయిలలో ఆయ న నివేదికలు తెప్పించుకుని పరిశీలించారు. దీనిలో ప్రధానంగా చంద్రబాబు స్వయంగా ఐవీఆర్ ఎస్ ద్వారా రంగంలోకి దిగి.. సర్వేలు చేశారు. నియోజకవర్గాల స్థాయిలో నివేదికలు తెప్పించుకున్నారు. సీనియర్లతో కమిటీ వేసి.. నాయకులను పిలిపించుకుని ఇంటర్వ్యూలు చేశారు. ఆర్థిక, సామాజిక, సానుభూతి, ప్రజాదారణ, ప్రత్యర్థి బలం ఇలా.. పంచ ప్రణాళికను ముందు పెట్టుకుని వండి వార్చారు. సో.. ఈ జాబితాకు బలం ఎక్కువ అనడానికి ఇదే ఉదాహరణ!!