NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!

నిన్న మొన్నటి వరకు వైసిపి లోనే ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో అదే వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పలువురు కీలక నేతలను కలుపుకుని ఈరోజు హైదరాబాదులో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబానికి గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ కారణాలతో తెలుగుదేశం పార్టీకి దూరమై కాంగ్రెస్లో చేరారు.

The YCP MLA who emptied the entire YCP there.
The YCP MLA who emptied the entire YCP there.

2019 ఎన్నికలలో మైలవరం నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు. ఐదేళ్లుగా కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఎంత మాత్రం ఇమ‌డలేకపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు ఉన్నా పార్టీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మైలవరం నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. అనూహ్యంగా ఇప్పుడు కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరుతుండడంతో అక్కడ టిడిపి నుంచి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీటు వస్తుందా ? రాదా అన్న సందిగ్ధత నెలకొంది.

ఈరోజు నందిగామ నియోజకవర్గంలోని తన స్వగ్రామం అయిన ఐతవరం నుంచి 100 కారులతో ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడ చంద్రబాబు సమక్షంలో కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరుతున్నారు. కృష్ణ ప్రసాద్ తనతో పాటు మైలవరం నియోజకవర్గంలోని ప్రధాన వైసీపీ క్యాడర్ను అంతా ఖాళీ చేసి మరి సైకిల్ ఎక్కేస్తుండటం విశేషం. కృష్ణ ప్రసాద్ పార్టీకి దూరమవుతారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైసీపీ అధిష్టానం మైలవరం జడ్పిటిసిగా ఉన్న స‌ర్నాల‌ తిరుపతిరావు యాద‌వ్‌ను మైలవరం అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంపిక చేసింది.

తిరుప‌తి రావు యాద‌వ్ అసెంబ్లీకి పోటీ చేసే అంత సత్తా ఉన్న నేత అయితే కాదు. కేవలం డమ్మీగా మాత్రమే జగన్ తిరుపతిరావును సమన్వయకర్తగా ఎంపిక చేశారని ఫైనల్ గా మైలవరం నుంచి వైసీపీ తరఫున మరో నేత పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని లేదా ఆయన కుమార్తె కేశినేని శ్వేత‌ లేదా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జోగి రమేష్ పేర్లు వైసిపి రేసులో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మైలవరం నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మ‌సాని సుబ్బారావు, ప్ర‌స్తుత‌ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వీళ్లంతా తెలుగుదేశంలో ఉండడంతో వైసిపి దిక్కుతోచని స్థితిలో ఉందన్నమాట వాస్తవం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju