సుప్రీమ్ హీరో, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే ఉప్పెన చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవ్వనున్నది.
అయితే, ఎప్పుడో ఈ సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయినా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో థియేటర్లు లేని నేపథ్యంలో ఈ సినిమా ని ఇప్పటి వరకు రిలీజ్ చెయ్యలేదు. ఇప్పటికే OTT నుంచి ఎన్ని భారీ ఆఫర్స్ లను ఈ చిత్రం తిరస్కరించినట్లు సమాచారం. ఇది వైష్ణవ్ తేజ్ కి తొలి సినిమా అవ్వడంతో ఈ సినిమా ను థియేటర్లలో కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ ఇన్నాళ్లు ఎదురు చూశారట.
ఈ సినిమా ను ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చెయ్యాలని ఈ చిత్రం బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రావడంతో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా నిర్మాతలు.
ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ తన కూతురిని ప్రేమించిన కులం తక్కువ హీరో కు ప్రేక్షకులు షాక్ అయ్యేలా హీరోని చంపకుండా చాలా తీవ్రమైన శిక్ష ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రేమ ఎంత గొప్పదో చాటేలా ఈ సినిమా క్లైమాక్స్ ని చాలా అందంగా ఎవ్వరు ఊహించని విధంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.