టెక్నాలజీ తో పాటు ఉ కాలంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి.. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలలో ఇప్పటివరకు కార్లు, బైకులు ,స్కూటర్లు, బస్సులు మాత్రమే చూశాం.. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో కి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కూడా చేరింది..! పంజాబ్ కు చెందిన ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ సోనాలిక దేశంలో తొలి విద్యుత్ ట్రాక్టర్ ను విడుదల చేసింది..! దీనిని టైగర్ గా పిలుస్తున్నారు..! ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..
ఫీచర్స్ :
టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో అత్యాధునిక ip67 25.5 కిలోవాట్ల నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీ తో ఇది నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 24.93 కిలోమీటర్లు. ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేశాక 2 టన్నుల ట్రాలీ తో నడిపిన 8 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని సంస్థ తెలిపింది. కేవలం నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. డీజిల్ ట్రాక్టర్ ల తో పోలిస్తే ఈ విద్యుత్ డాక్టర్ నిర్వహణ ఖర్చు నాలుగోవంతు మాత్రమే అవుతుందని తెలిపారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.5.99 లక్షలు. ఇప్పటికే బుకింగ్ లు ప్రారంభం అయినట్లు సోనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిత్తల్ తెలిపారు.
భారతదేశంలో ప్రముఖ ట్రాక్టర్ బ్రాండ్ సోనాలిక విస్తృతమైన వినూత్న ట్రాక్టర్లను అందిస్తుంది. హెచ్ పి 20 – హెచ్ పి 90 వరకు అత్యంత ప్రాచుర్యం పొందిన ట్రాక్టర్ మోడల్స్ ను అందిస్తుంది. పంజాబ్ కు చెందిన ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ సోనాలిక గ్రూప్ జూన్ నెలలో అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉండే ఎయిర్ కండిషన్, థియేటర్ ఆప్షన్ తో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్ వరల్డ్ ట్రాక్ 90 హెచ్ పి భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.