(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి సెటైర్లు వేశారు. పాకిస్తాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరాన్ పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్.. అక్కడ జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ జర్మనీ, జపాన్ పక్కపక్కనే ఉంటాయని, సరిహద్దులు పంచుకుంటున్న రెండు దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పరిశ్రమలతో అభివృద్ధి చెందాయని అన్నారు. దీంతో ఈ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఇమ్రాన్ను ట్రోల్ చేస్తూ జోకులు పేల్చారు. అయితే, తాజాగా ఆనంద్ మహీంద్రా వంతు వచ్చింది. ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘దేవుడా! నీకు కృతజ్ఞతలు… ఈ వ్యక్తి మాకు చరిత్ర, జాగ్రఫీ ఉపాధ్యాయుడు కాకుండా చూశావు’ అంటూ ఆనంద్ మహీంద్రా కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
Thank you Oh Lord, for ensuring that this gentleman was not my History or Geography teacher…? pic.twitter.com/cIGxX0UdSh
— anand mahindra (@anandmahindra) August 25, 2019