వరసగా కేంద్ర మంత్రులు కరోనా బారిన పడుతుండడం కలవరపెడుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కేంద్రంలో పెట్రోలియం శాఖా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పుడు ధర్మేంద్రకు కరోనా పాజిటివ్ సోకడంతో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితమే కేంద్ర మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ సోకిన విషయం విదితమే. ఆయన కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసారు. వారి ఫలితాలు రావాల్సి ఉన్నాయి. మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. శనివారం తాను అమిత్ షా ను కలిశానని, టెస్టు ఫలితాలు వచ్చే వరకూ ఐసోలేషన్ లోనే ఉండనున్నట్లు బాబుల్ తెలియజేసారు.