Rainy Aeason: ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..మొదట ఈ వ్యాధి జ్వరం తో స్టార్ట్ అవుతుంది . ఆ తర్వాత తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వాంతులు అవడం వంటి లక్షణాలతో పాటు కళ్లు ఎర్రబడటం కూడా ఈ వ్యాధి లక్షణం కిందకే వస్తుంది. ఈ వ్యాధి సోకితే ఒక 5 రోజుల వరకు ఈ తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటారు.దీనికి చికిత్స:
మొదటి దశలోనే డాక్టర్ ని సంప్రదిస్తే యాంటీ బయోటిక్స్ ద్వారా నయం చేస్తారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మెదడువాపు, మూత్రపిండాల వైఫల్యం, రక్తస్రావం, వంటి తీవ్రమైన సమస్యలతో పాటు, కొందరిలో లివర్ డ్యామేజ్ అయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు తెలియచేస్తున్నారు.
ఈ వ్యాధి బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం…
వర్షాకాలంలో వచ్చే వరద నీటిలో నడవడం , క్లోరిన్ తో శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం వంటివి చేయకూడదు. వర్షం తో కూడిన వరద నీటిని తాకిన
ప్రాంతాలను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేసుకోవాలి . ఇంటి పరిసరాల్లో ఎలుకలను చేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీటిని ఎలాంటి అవసరాలకు వాడకపోవడం మంచిది. రోడ్లపై అమ్మే రకరకాల పానీయాలు తాగకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది . ఒకవేళ ఇలాంటి నీటిలో తప్పని పరిస్థితిలో నడిచి వస్తే, వెంటనే వేడి నీటిలో ఉప్పు వేసి కొద్దిసేపు ఉంచి తర్వాత మంచినీటిని ఉపయోగిస్తూ సోప్ తో శుభ్రం చేసుకోవాలి. ఏమాత్రం సందేహం ఉన్న వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.