ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఖాతాలో ఉన్న 12 నియోజకవర్గాలు.. ఈ సారి కైవసం చేసుకోవడం కష్టమే నా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఆయా పార్టీల ఓట్లు చీలిపోయి.. వైసీపీ మేలు చూకూరిన ప్రధాన నియోజకవర్గాలు ఈ పన్నెండే. ఆయా 12 నియోజకవర్గాల్లోనూ 25 నుంచి 5 వేల లోపు మాత్రమే.. వైసీపీ విజయం దక్కించుకుం ది. ఇవి పెద్ద మెజారిటీలు కాకపోవడం గమనార్హం.
దీంతో వచ్చే ఎన్నికల్లో కనుక.. ఇరు పార్టీలూ భేషజాలకు పోకుండా.. లేదా గత ఎన్నికల్లో స్వల్ప మెజారి టీతోనే కదా.. ఓడిపోయాం అనేధీమాతో వ్యవహరించకుండా.. ఒకింత శ్రమిస్తే.. ఈ నియోజకవర్గాలు వైసీ పీకి దూరం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 1000 లోపు మెజారిటీ ఉండడం కూడా గమనార్హం. వైసీపీ కేవలం స్వల్ప మెజారిటీతోనే విజయం దక్కించుకున్న స్థానాలు. ఇక్కడ కనుక ఉమ్మడిగా పోరు సాగిస్తే.. మిత్రపక్షం జోరు పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
అయితే… వైసీపీ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ 12 నియోజకవర్గాల్లోనూ దాదాపు అభ్యర్థు లను మార్చేసే ప్రయత్నంలోనే ఉంది. ఇప్పటికే కొందరిని ప్రకటించింది. దీంతో వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడం, కొత్త అభ్యర్థులను టార్గెట్ చేయడం అనేది.. ఇప్పుడు టీడీపీ-మిత్రపక్షాలు చేయాల్సిన ప్రధాన పని. ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. మరోసారి అభ్యర్థులు గెలుపు గుర్రాలను ఎక్కడం కష్టమనే వాదన ఉంది.
ఇవీ.. కీలక స్థానాలు..
విజయవాడ సెంట్రల్ -25
తిరుపతి – 708
పొన్నూరు – 1,112
నెల్లూరు సిటీ – 1,988
తణుకు – 2,195
నగరి – 2,708
కొత్తపేట – 4,038
ఏలూరు – 4,072
ఎలమంచిలి – 4,146
తాడికొండ (sc) – 4,433
ప్రత్తిపాడు – 4,611
జగ్గయ్యపేట – 4,778