విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారు. అయితే.. ఆయనకు ఇక్కడ కొత్త కావడంతోపాటు.. వెస్ట్ నియో జకవర్గంలో వచ్చిన ఆరోపణలు ఇక్కడ వర్కవుట్ అవుతున్నాయి. వెస్ట్లో ఆయన సోదరులు ఇద్దరూ.. వ్యాపార వేత్తలను పిండేశారనే టాక్ గత రెండేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆయ నను నియోజకవర్గం దాటించేసిందనే వాదన కూడా ఉంది.
ఇప్పుడు ఇదే టాక్ సెంట్రల్లోనూ వినిపిస్తోంది. పైగా.. ప్రశ్నించిన వారిపై ఆయన కేసులు పెట్టించారు. ఇది సొంత పార్టీలోనూ నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడు సెంట్రల్లో ఏమేరకు సహకరిస్తారనేది ప్రశ్నగా ఉంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ ఎదురవుతోంది. తన వర్గం వారిని కట్టడి చేస్తున్నారు. ఎక్కడా వెలంపల్లికి సహకరించకుండా అడ్డుకుంటున్నారనేది నియోజకవర్గంలో కనిపిస్తూనే ఉంది.
ఇటీవల నియోజకవర్గంలోని సత్యనారాయణపురంలో వెల్లంపల్లి పర్యటించారు. తనకు ఓటేయాలని ప్రజలను కలిశారు. అయితే.. ఆయన వెస్ట్ నుంచి తెచ్చుకున్న అనుచరులే తప్ప.. సెంట్రల్ నియోజక వర్గానికి చెందిన వారు ఒకరిద్దరు ఎవరూ కనిపించలేదు. దీంతో ఆయన ఇదే విషయాన్ని పార్టీ హైకమాం డ్కు ఫిర్యాదు చేశారు. దీనిని పరిష్కరించేందుకు పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకున్నా.. మల్లాది మాత్రం నాకేంటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక, మరోవైపు వెల్లంపల్లికి స్థానిక సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. మల్లాది హామీ ఇచ్చిన సమస్య పరిష్కారంలో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇది ఎటు వెళ్లినా.. వెల్లంపల్లికి ప్రశ్నగా మారింది. ప్రజలు ఆయనను ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరైనా పరిష్కరిస్తారా? అని అడుగుతున్నారు. అంతేకాదు.. రాసి ఇవ్వాలంటూ.. ఇటీవల బావాజీ పేట వాసులు ఆయనను ప్రశ్నించే సరికి.. ఆయన మౌనంగా ఉన్నారు. ఇలా.. అన్ని వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతుండడంతో ఏం చేయాలో తెలియక వెల్లంపల్లి తల పట్టుకున్నారు.