ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. చేనేత పరిశ్రమలలో ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని చెప్పారు జగన్. భారతదేశంలో అతిపెద్ద చేనేత సాంద్రత మన రాష్ట్రంలోనే ఉందని తెలిపారు.
మా చేనేత పరిశ్రమను చూసి గర్వపడుతున్నామని, మరియు ఈ గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నేతన్న నేస్తం గురించి ప్రస్తావించారు జగన్. వరసగా రెండేళ్ల పాటు ఏడాదికి 24,000 వేలు చొప్పున నేతన్నలకు తన ప్రభుత్వం అండగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసారు. కోవిద్ సమయంలో ఆరు నెలలు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం లబ్దిదారులకు నగదు పంపిణీ ఇటీవలే పూర్తి చేసారు. మగ్గం కలిగిన ప్రతీ నేతన్నకు ఈ నగదు పంపిణీ జరిగింది.