YS Sharmila: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు షర్మిల. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారని అడిగారు.
28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్సీటలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయిందన్నారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి ఎందుకు సీట్లు నిరాకరించారని అడిగారు.
ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా అని ప్రశ్నించారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్దిస్తున్నారు అని అడిగారు. స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని బహిరంగ లేఖలో ప్రశ్నలను సంధించారు.
YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్