YSRCP: “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” అన్నారు ఓ మహా కవి. కానీ అది అవునో కాదో తెలియదు కానీ రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలే వేరులే అన్నది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది. విశాఖ నగర పాలక సంస్థ 31వ డివిజన్ ఉప ఎన్నికల్లో వైసీపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. వైసీపీ ట్విస్ట్ కు అక్కడి టీడీపీ ఖంకుతిన్నది.
Read More: Kuppam Municipality: కుప్పం మున్సిపల్ అఫీసు వద్ద టీడీపీ నేతల ఆందోళన..! ఎందుకంటే..?
YSRCP: పార్టీ అభ్యర్ధిగా మారిన స్వతంత్ర అభ్యర్ధి
విషయంలోకి వెళితే.. విశాఖ జీవీఎంసీ పరిధిలో 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్, 61వ వార్డు వైసీపీ కార్పోరేటర్ మృతి చెందడంతో ఈ వార్డుల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏ పార్టీకి చెందిన వారు మృతి చెందారో ఆ ప్రాంతంలో మరొకరు పోటీ చేయకూడదని టీడీపీ, వైసీపీ ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ అంగీకారం మేరకు 61వ వార్డులో టీడీపీ అభ్యర్ధిని ఆ పార్టీ పోటీ పెట్టలేదు. వైసీపీ కూడా 31వ వార్డులో పోటీకి అభ్యర్ధిని పెట్టలేదు. సో.. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే 31వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధిగా బిపిన్ కుమార్ జైన్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడంతో రిటర్నింగ్ అధికారి బీరువా గుర్తు కేటాయించారు. అయితే వైసీపీ సదరు స్వతంత్ర అభ్యర్ధికి బీఫాం అందజేయడంతో సాయంత్రం ఆరు గంటల తరువాత అదే బిపిన్ కుమార్ జైన్ కు వైసీపీ ఫ్యాన్ గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారి మరో ప్రకటన విడుదల చేశారు. దీంతో టీడీపీ ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ విలువలను దిగజారి ప్రవర్తిస్తుందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది.
బద్వేల్ లో సంప్రదాయం విశాఖలో తప్పింది
ఇటీవల బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి అభ్యర్ధులను టీడీపీ, జనసేన నిలపలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ నగర పాలక సంస్థ 31వ డివిజన్ లో పోటీ వైసీపీ నుండి పోటీ పెట్టడం లేదని కూడా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ మాట మార్చి ఇండిపెండెంట్ అభ్యర్ధిని పార్టీ అభ్యర్ధిగా నిలపడంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.