YSRCP: నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన బాధిత టీడీపీ కుటుంబాలను పరామర్శించి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇటీవల ఈసీ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన రోజు నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
ఈ తరుణంలో నారా భువనేశ్వరి డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రత్తిపాడు అభ్యర్ధి బాలసాని కిరణ్, నారాయణ మూర్తి లు ఏపీ సీఇఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
కడప జిల్లా రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను ఫిర్యాదుతో జత చేశారు. అలానే ఈనాడు పత్రికలో సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తొంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్ధి రామాంజనేయులు, ఆయన అనుచరులు తమపై దాడి చేశారని తెలిపారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
Big Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఈడీ