ఇంటర్నెట్ రాకతో మన జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఏ చోటును చూడాలన్నా.. క్షణాల్లో ఇంటర్నెట్ వినియోగంతో చూడొచ్చు. ప్రపంచ నలుమూలలను నట్టింట్టోకి తెచ్చిన ఘనత ఇంటర్నెట్ దే అనడంలో సందేహం లేదు. ఏ సమాచారం కావాలన్నా.. ఎక్కడికి ఎలా చేరుకోవాలన్నా.. సెకండ్లల్లో మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇక వినోదం మాట చెప్పనవసరం లేదు. సినిమా హాల్స్ లేవన్న బాధే లేకుండా చేసింది ఇంటర్నెట్.
ఇంటర్నెట్ రాకతో ఇంకా చెప్పాలంటే బంధాలు కూడా గట్టి పడ్డాయని చెప్పొచ్చు. ఎక్కడో అమెరికాలో ఉన్న బంధువులతో మాట్లాడాలంటే ఫోన్ ద్వారా ఎంతో డబ్బును ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చాకా.. అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చి ఇంటర్నెట్ ద్వారా ప్రీ కాల్స్ మాట్లాడే అవకాశం కలిగించాయి. జస్ట్ ఆడియో కాల్స్ మాత్రమే కాకుండా వీడియో కాల్స్ ను సైతం ఫ్రీగా అందించాయి.
ఇక కరోనా వైరస్ రాకతో ఈ ఇంటర్నెట్ వినియోగం ఎంతల పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాంతో కంపెనీలు వాళ్ల ఎంప్లాయిస్ తో వర్చువల్ మీటింగులు పెట్టుకోవడానికి ఈ వీడియో కాల్స్ ను ఎక్కవగా వాడాల్సి వస్తోంది. ఇందులో చాలా రకాల యాప్స్ కి సంబంధించిన కం పెనీలు ఉన్నా కానీ అతి తక్కువ రేటు కు వీడియో మీటింగులను అందించడంలో “జూమ్” ప్రాచుర్యం పొందిందని చెప్పొచ్చు. ఈ జూమ్ కేవలం కంపనీలకే కాకుండా పర్సనల్ గా గ్రూప్ వీడియో మీటింగ్ లు పెట్టుకునే అవకాశం ఫ్రీ గానే కల్పించింది.
అయితే ఈ ఫ్రీ గ్రూప్ వీడియో కాలింగ్ కు కొంత లిమిట్ పెట్టింది. దాంతో ఆ సమయం అయిపోగానే మళ్లీ కొంత సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దాంతో ఎంతో ప్రేమాతో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండంగానే కాల్ కట్ అయిపోవడంతో నిరశ చెందాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఈ యాప్ తమ కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది.
జూమ్ థ్యాంక్స్ గివింగ్ రోజైన ఈ నెల 26న అర్ధరాత్రి నుంచి నెక్ట్స్ డే మార్నింగ్ 6 గంటల వరకు కాల్స్ విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని ప్రకటించింది. దాంతో జూమ్ వినియోగ దారులు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. వీడియో కాలింగ్పై ప్రస్తుతం 40 నిమిషాల పరిమితి ఉంది. కానీ 26న మాత్రం ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా తెలిపింది. అయితే గూగుల్ మీట్ లో కూడా ఆంక్షలు ఉన్నాయి. కొంత సమయం తర్వాత కాల్స్ కట్ అవుతాయి. జూమ్ మాత్రం ఒక్కరోజు ఎంతసేపైనా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని.. మీ ఆత్మీయులతో ముచ్చటించండి మరి..!