ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తి నేతలు మెల్లమెల్లగా బయట పడుతున్నారు. ప్రజెంట్ పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో వీళ్లంతా గ్రూపుగా ఏర్పడి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలిపే విధంగా పరిణామాలు కనబడుతున్నాయి. జగన్ ఏడాది పరిపాలనలో పార్టీలో నాయకుల కంటే రాష్ట్రంలో ప్రజల లోనే ఎక్కువ సానుకూలమైన వాతావరణం కనబడుతోంది.
కానీ పార్టీలో నాయకులు మాత్రం అధికారంలోకి వచ్చి ఏడాది కావచ్చిన ప్రజలలో ఉన్న సంతోషం నాయకులలో కనబడటం లేదు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గత రెండు రోజులుగా పార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైసిపి పార్టీపై బురద జల్లే విధంగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి.
ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడటం వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కలుగజేసుకుని ఆనం రామనారాయణ రెడ్డితోపాటు జగన్ తో కలిపి కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించి ఆనం రాంనారాయణ ని కూల్ చేసినట్లు వైసీపీ పార్టీలో టాక్. అదలా ఉంటే ఆనం రాంనారాయణ రెడ్డి ఇంత తీవ్రస్థాయిలో ఫైర్ అవటానికి కారణం జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పద్ధతి అని కొంతమంది పరిశీలకులు అంటున్నారు. మరి ఎంత వరకు నిజం అనేది తెలియాలి.