ఢిల్లీ, జనవరి13: కోడి కత్తి కేసులో తన ప్రమేయం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అరోపించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది కాబట్టి అప్పుడు కేంద్రానిదే బాధ్యత అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు లేఖ రాయడంలో ఉద్దేశం ఏమిటో ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ముఖ్యమంత్రితోపాటు అతని తనయుడు ఐటి మంత్రి లోకేష్ దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు.
మోదీ మరో మారు దేశానికి ప్రధానమంత్రి అవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు.
previous post