అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని వ్యాఖ్యానించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘విజయసాయిరెడ్డి గారు మీరు కేసుల మాఫీ కోసం ఢిల్లీ లో కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయే సరికి స్వయంగా జగన్ గారినే రంగంలోకి దింపారట కదా. వైసీపీని బీజేపీలో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి పదవిని జగన్ కి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పెద్దల దగ్గర మెడలు వంచారు అని తెలిసింది! ఇప్పటిదాకా ఎంతో పకడ్బందీగా మీరు వేసిన స్కెచ్లు అన్నీ పసిగట్టి, అవన్నీ బీజేపీ పెద్దలకు చెబుతున్నారు అనే కదా మీరు రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ మీ పథకం పారిందా లేక అదికూడా మీ లీకుల పరంపరలో కొట్టుకు పోయిందా విసా రెడ్డి గారు’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.
ఇప్పటిదాకా ఎంతో పకడ్బందీగా మీరు వేసిన స్కెచ్లు అన్నీ పసిగట్టి, అవన్నీ బీజేపీ పెద్దలకు చెబుతున్నారు అనే కదా మీరు రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ మీపథకం పారిందా లేక అదికూడా మీ లీకుల పరంపరలో కొట్టుకు పోయిందా విసా రెడ్డి గారు !!
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 25, 2019