Revanth Reddy : కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న కొద్ది కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు మాస్క్, శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూసుకోవాలి అని తెలిపింది. కాగా ప్రభుత్వాలు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా గాని ..
మరోపక్క కరోనా దాని పని అది చేసుకుంటూ పోతోంది. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎవ్వరిని విడిచి పెట్టడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు బయటపడటంతో.. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించగా… పాజిటివ్ రిపోర్ట్ రావడంతో వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లడం జరిగింది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ చికిత్స తీసుకుంటున్నా, గత వారం నుండి నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించండి అని తెలిపారు.