ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా దేశం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారికంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా దేశంలో కొన్ని రాష్ట్రాలు రష్యా తీసుకొచ్చిన వ్యాక్సిన్ ని ఇక్కడ తమ రాష్ట్రాలలో తీసుకురావటానికి ఆ వ్యాక్సిన్ కోసం చర్చలు జరిగినట్లు వార్తలు రావడంతో నీతి అయోగ్ అలర్ట్ అయింది.
నీతి అయోగ్ సభ్యుడు ఏకే పాల్ నేతృత్వంలో కరోనా వాక్సిన్ పై ఇటీవల నిపుణులతో ఢిల్లీలో చర్చించారు. ఈ సందర్భంగా దేశమంతటా ఒకే వ్యక్తిని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యి, కరోనా వ్యాక్సిన్ కొనడానికి తొందరపడవద్దు అంటూ అన్ని రాష్ట్రాలకు నీతి అయోగ్ కమిటీ కీలక సూచనలు చేసింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఎవరు పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవంటూ నీతి అయోగ్ నిపుణుల బృందం హెచ్చరించింది.
అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ పై ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు ఆ తర్వాత అనుసరించాల్సిన విధివిధానాలపై ఈ సమావేశంలో నిపుణులు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో జరిగిన ఈ సమావేశంలో దేశం మొత్తం కూడా ఒకే ఒక విధమైన వ్యాక్సిన్ వినియోగించాలని నీతి అయోగ్ నిపుణులు అంటున్నారు. అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కరోనా వ్యాక్సిన్ విషయంలో ఒప్పందాలు చేసుకోవద్దు అంటూ హెచ్చరించారు.