వైయస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి టిడిపి పార్టీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని పార్టీలో వచ్చిన గాని అంతిమంగా రాజకీయం తనకి టిడిపి పార్టీ కి అన్నట్టుగా నిర్వీర్యం చేసే రీతిలో వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టిన జగన్… అదే రీతిలో దూసుకుపోతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా టిడిపి నీ సమాధి చేసే అవకాశం జగన్ కి ఇవ్వకుండానే తానే ఫినిష్ చేసే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు పరిశీలకుల మాట. పూర్తి విషయంలోకి వెళితే కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర చాలావరకు బిజెపి పోషిస్తూ వస్తోంది. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత జగన్ ప్రభుత్వం పై అనేక రీతులుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. మరోపక్క టిడిపి ఎదగకుండా… గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు రెచ్చి పోతున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషన్ ఆంధ్రప్రదేశ్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా టిడిపి నేతలు తమ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసులరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో రెండో స్థానం లోకి టిడిపి రాకుండా బిజెపి నేతలు చాలా వరకు కట్టుదిట్టంగా వ్యూహాలను సిద్ధం చేసుకుని భవిష్యత్తులో రాజకీయాలు చేయడానికి రెడీ అయినట్లు టాక్. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ ముఖ చిత్రం చూస్తే జగన్ ఇన్వాల్వ్ అవ్వకుండానే ఏపీలో టీడీపీకి బిజెపి సమాధి సిద్ధం చేయడం గ్యారెంటీ అనే కామెంట్లు వస్తున్నాయి. ఇదే తరుణంలో చంద్రబాబు మరోపక్క జగన్ ని ఢీ కొనాలంటే మోడీతో కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్న తరుణంలో ఏపీ రాష్ట్ర బీజేపీ మాత్రం చంద్రబాబు ని తీవ్రస్థాయిలో విభేదించడంతో…రాబోయే రోజుల్లో టిడిపి కనుమరుగయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.