జగన్ ముఖ్యమంత్రి అయ్యే 16 నెలల పరిపాలన కాలంలోనే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే విధంగా మారిపోయారు. రాష్ట్రంలో జగన్ చేపడుతున్న పథకాలు మరియు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు జాతీయ స్థాయిలో ఉన్న నేతలను ఆలోచనలో పడేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మోడీ కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలను సమర్థించడం గమనార్హం. ఇటీవల మోడీ ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఏపీలో జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థల పనితీరును ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అవలంబించాలని కోరుతున్నారు.
చాలా వరకు ఢిల్లీలో జగన్ తన పరపతిని పెంచుకుంటుపోతున్నారు. ఒకానొక సమయంలో ఏపీ నుండి రాజకీయ నేతలు వెళితే అపాయింట్మెంట్ కోసం చాలా సమయం పట్టేది. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదేరీతిలో జరిగింది. కానీ ఇప్పుడు జగన్ కోసం కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుని జగన్ ఢిల్లీ పేరు చెప్పి వణికించే రీతిలో రాజకీయాలు చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలా వరకు జగన్ నేషనల్ స్థాయిలో బాబు నుంచి మించిపోయినట్లు టాక్ వస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ విమానం ఎక్కితే చాలు ప్రతిపక్ష పార్టీ టిడిపి బిత్తరపోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా జగన్ ఢిల్లీ పర్యటన అంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతున్నట్లు .. కంటికి కునుకు కూడా పడటం లేనట్లు టాక్. తన హయాంలో జరిగిన తప్పులు ఇవన్నీ బయటకు తీసుకొచ్చే రీతిలో జగన్ సిబిఐని ఎంటర్ చేస్తాడేమో అన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండుసార్లు జగన్ ఢిల్లీ హఠాత్తుగా వెళ్లడంతో పాటు మోడీతో అదేవిధంగా అమిత్ షాతో భేటీ అవ్వటం ఇప్పుడు టిడిపి శిబిరంలో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాలో అన్న ఆలోచనలో నాయకులు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.