తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ సంతకం ఫోర్జరీ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న కరీంనగర్ యువకుడి ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి దగ్గర లక్షల లో డబ్బులు వసూలు చేసిన సంఘటన బయటపడటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి సదరు యువకుడిని అరెస్టు చేశారు.
కేసిఆర్, కేటీఆర్ తో దిగిన ఫోటోలను ఉపయోగించి పేస్ బుక్, వాట్సాప్ డిపీలు పెట్టుకొని… కరీంనగర్ కి చెందిన సాయి చింటూ మంత్రి కేటీఆర్ తనకి బాగా క్లోజ్ అంటూ, ఎలాంటి పని అయినా కేటీఆర్ చేసి పెడతారు అంటూ మోసాలకు పాల్పడి ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ యువజన కార్యదర్శి అంటూ ఆలిండియా యాంటీ కరప్షన్ కమిటీ తెలంగాణ చైర్మన్ ను అంటూ బిల్డప్ ఇచ్చి తనకున్న పరిచయాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలంగాణ నిరుద్యోగులను చాలా మందిని మోసం చేశారట.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పోలీసులు ఇతగాడి పై చర్యలు తీసుకోవాలి అంటే కొద్దిగా ఆలోచిస్తున్నట్లు…. మంత్రి కేటీఆర్ కి దగ్గరగా ఉన్న వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారట. కాగా ఇలాంటి న్యూస్ కేసిఆర్ కి తెలిస్తే కచ్చితంగా ఆయన రియాక్షన్ ఖంగు తినే విధంగా ఉండటం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. ముఖ్యంగా త్వరలోనే తనయుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పాలని కేసిఆర్ అనుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు…. తన పార్టీకి చెడ్డ పేరు తీసుకు రావడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు.