NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

ప్రజల జేబుల్లోంచి ‘ సాక్షి ‘ జేబుల్లోకి పంపుతున్నారా ముఖ్యమంత్రి గారూ ?

గతంలో హెరిటేజ్ కంపెనీ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిందని దానిలో అవకతవకలు జరిగాయని సిబిఐ విచారణ కు ఏపీ క్యాబినెట్ నిర్ణయించుకుంది. అది చంద్రబాబు కుటుంబానికి చెందిన కంపెనీ కావడంతో ప్రభుత్వం, సిబిఐ విచారణలో అంత సీరియస్ గా తీసుకున్నాయి. మరి ఇదే జగన్ కు కూడా వర్తిస్తుందా..?

మరీ ఇంత బహిరంగంగానా…?

నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలను ముఖ్యమంత్రి సొంత మీడియాకు ఇచ్చారు అన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. జగన్ కంపెనీల విషయంలో ప్రభుత్వ పెద్దలు గతంలో హెరిటేజ్ పైన చూపిన నిబద్ధత…. నిజాయితీ చూపించడం లేదు. ఈ ఏడాది కాలంలో దాదాపుగా రూపాయలు 60 నుండి 70 కోట్ల రూపాయలు సాక్షికి ప్రకటనల రూపంలో వచ్చాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కంటే ఇది దాదాపు 20 శాతం ఎక్కువ. అన్ని ప్రకటనలు సాక్షి కి వెళ్లడం అవినీతి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

ఒక్కడే గుట్టంటా విప్పాడు..!

‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ చట్టం కింద ఓ వ్యక్తి ప్రభుత్వం నుండి సేకరించిన వివరాల ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా ఏడాది కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా మొత్తం 17 కోట్ల ప్రకటనలు జారీ అయ్యాయి. ఇందులో రెండవ అత్యధిక సర్కులేషన్ ఉన్న సాక్షి పత్రికకు ఆరు కోట్ల పైన వాటా ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇచ్చింది నాలుగు కోట్ల 20 లక్షల ప్రకటనలు మాత్రమే. మూడో స్థానంలో ఆంధ్రజ్యోతి పత్రిక పేరు అసలు దాదాపుగా తుడిచేశారు. ఏడాది కాలంలో వారికి 20 లక్షల ప్రకటనలు మాత్రమే ఇచ్చినట్లు చూపించారు. ఇదే సమయంలో ప్రజాశక్తి కి కోటికి పైగా ప్రకటనలు వెళ్లాయి. ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్ లకు కూడా 60 70 లక్షల వరకు ఇవ్వడం గమనార్హం.

ప్రభుత్వం మారితే అవినీతేనా..?

ఇక ఇదంతా బయటకు కనిపించేది మాత్రమే. ఇతర డిపార్ట్మెంట్లు విడివిడిగా తమ ఖాతాల ద్వారా ప్రకటనలు జారీ చేశారు. ఇలా అవి మొత్తం ఖర్చు పెట్టిన డబ్బు సుమారు 82 కోట్ల వరకు ఉంటుంది. ఈ మొత్తంలో సాక్షి పత్రిక కు సహజంగానే మెజారిటీ వాటా వెళ్ళింది. దాదాపుగా 35 కోట్ల రూపాయలు సాక్షి ఖాతాలోకి వెళ్లగా సర్కులేషన్ లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకి 27 కోట్లు వెళ్లాయి. ఆంధ్రజ్యోతి కి మరలా మెండి చేయి ఎదురైంది. డిపార్ట్మెంట్ ఎలా ప్రకటనలు ఇచ్చినా అది ప్రజాధనం.

పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థలకు పిసరంతైనా మేలు చేయడానికి జంకుతారు కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సొంత పత్రికకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు వెళ్లాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కన్నా ఎక్కువగా ప్రకటనలు ఇవ్వడం ఏమిటో వారికే తెలియాలి. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటనల రేట్లను భారీగా పెంచేసింది. ఇక్కడ సాక్షికి అత్యధిక ప్రకటనలు వెళ్లడం తోనే అవినీతి అంతా తేటతెల్లమైంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju