NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ntr Vangaveeti: ‘ఎన్టీఆర్-వంగవీటి’.. ఏ జిల్లాకు ఎవరు..? పెద్ద సమస్యే..!

ntr vangaveeti political confusion

Ntr Vangaveeti: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన ప్రభుత్వానికి కొత్త సమస్య తీసుకొస్తోంది. జిల్లాలకు మహనీయులు, ప్రముఖుల పేర్లు పెట్టాలని వస్తున్న డిమాండ్లే ఇందుకు కారణం. దీంతో ప్రభుత్వ పెద్దలకు కొత్త తలనొప్పి మొదలైంది. జిల్లాలకు పెట్టే పేర్ల విషయంలో మాత్రం ఎవరూ తగ్గేలా లేరు. ఇందులో ప్రముఖమైంది కృష్ణా జిల్లా. ఉమ్మడి ఏపీ నుంచీ ఈ జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం ఎక్కువ. ఇప్పుడీ జిల్లాను రెండుగా విభజించి విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు. జగన్ పాదయాత్రలో భాగంగా గుడివాడ పర్యటనలో ఉండగా ఇచ్చిన హామీ మేరకు సీఎం అయ్యాక హామీ నెరవేర్చారు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలనే కొత్త డిమాండ్ తో ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చింది.

ntr vangaveeti political confusion
ntr vangaveeti political confusion

ఇద్దరి పేర్లు సాధ్యమేనా..

ఎన్టీఆర్ గుడివాడ ప్రాంతంలోని నిమ్మకూరులో జన్మించారు. ఆ ప్రాంతం మచిలీపట్నం జిల్లాలో కలుస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొందరు అంటున్నారు. మచిలీపట్నం జిల్లాలోనే కాపులెక్కువ ఉంటారు కాబట్టి ఆ జిల్లాకు రంగా పేరు పెట్టాలనేది మరో డిమాండ్. దీంతో ఒకే జిల్లాకు ఇద్దరు ప్రముఖుల పేర్లు పెట్టాలనే డిమాండ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే.. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ప్రకటించేశారు. దీంతో రెండు జిల్లాలో ఏదకొ జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తో ఇప్పుడు కాపులు సంతకాల సేకరణ కూడా మొదలుపెడుతున్నారు. కృష్ణా జిల్లాలో కాపు-కమ్మ సామాజికవర్గాల జనాభా సమానంగానే ఉన్నా.. ఓట్లు, జనాభాపరంగా కాపులే కొంత ఎక్కువ ఉంటారని అంచనా.

కాపుల డిమాండ్..

అయితే.. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వంగవీటి కుటుంబం ఎప్పుడూ చేయలేదని రంగా అనుచరులు చెప్తున్న మాట. గతంలోనే వినతిపత్రం ఇచ్చామనేది బంధువులు మాట. ఏదొక జిల్లాకు రంగా పేరు పెడితే రాధాకు రాజకీయ లబ్ది.. కాపులకు గౌరవం లభిస్తుంది. మరోవైపు నరసారావుపేటలో కూడా కాపుల సంఖ్య ఎక్కువ. ఈ జిల్లాకు స్వాతంత్ర సమరయోధుడు, కాపు నేత కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి. రాజకీయంగా కాపులు వైసీపీ వెన్నంటే ఉన్నారు కాబట్టి.. తమకు తగిన గౌరవం ఇవ్వాలని కాపు నాయకులు అంటున్నారు. మరి.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే..!

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju