అమరావతి: టిడిపి రాజ్యసభ టిజి వెంకటేష్ పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరినప్పటికీ ఆయన తనయుడు టిజి భరత్ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన భరత్ కూడా తండ్రి వెంకటేష్ వెంట పార్టీ మారతాడని అందరూ భావించారు. తాను టిడిపిని వీడటం లేదని భరత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నారా లోకేష్కు కూడా ఫోన్ చేసి చెప్పానని భరత్ పేర్కొన్నారు. తన తండ్రి బిజెపిలో చేరడానికి ముందు తనతో ఫోన్లో మాట్లాడారని భరత్ చెప్పారు.
ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేసుకుంటూ, విదేశీ పర్యటన నుండి రాగానే చంద్రబాబు, లోకేష్లను తాను కలుస్తానని భరత్ తెలిపారు.