జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్ధతి లోనే ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయింది. జరగబోయే ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ పార్టీలు బ్యాలెట్ పద్ధతి కి మొగ్గు చూపినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గుర్తింపు పొంది రిజిస్టర్ అయిన 50 పార్టీలలో 26 పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి.
ఈవీఎంల పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని మూడు పార్టీలు కోరగా… 13 పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపినట్లు తెలంగాణ ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్లో జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈవీఎంల ద్వారా అయితే వైరస్ సోకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దీంతో బ్యాలెట్ పద్ధతి ద్వారానే అయితే ఓటర్ కి ఎటువంటి వైరస్ సోకే అవకాశం ఉండదని మెజార్టీ పార్టీలు భావించి బ్యాలెట్ పద్ధతికి మొగ్గుచూపినట్లు టాక్.
ఇదిలా ఉండగా ఈ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని మేయర్ స్థానం కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరోసారి సత్తా చాటాలని ఫుల్ గా డిసైడ్ అయ్యింది. కాగా గత జిహెచ్ఎంసి ఎన్నికలు కేటీఆర్ పర్యవేక్షణలో అనేక స్థానాలు గెలవడంతో ఈసారి కూడా ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. దీంతో గతంలో మాదిరిగానే డిజిటల్ స్థాయిలో ఎక్కువ ప్రచారం చేయడానికి కేటీఆర్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే తరుణంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కూడా ప్రభుత్వంపై విమర్శలు తీసుకువచ్చే రీతిలో వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు టాక్.