ఒకానొక సమయంలో తెలుగు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన టిడిపి పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. విభజన జరిగిన తర్వాత ముందుగా తెలంగాణలో దెబ్బతిన్న పార్టీ, 2019 ఎన్నికల తర్వాత కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఎదర్కొంటుంది. 23 ఎమ్మెల్యేలకు దిగజారి ఏపీలో ప్రతిపక్షంలో ఉండటంతో ఫలితాలు వచ్చిన వెంటనే చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్ అయినా సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉన్న ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో ఉన్న ప్రతి పక్షం కాస్త చంద్రబాబుకి ఊడిపోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పార్టీకి సంబంధించి కొత్త కమిటీ ప్రకటన చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కొత్త కమిటీ ప్రకటన ప్రక్రియ అప్పుడే చేయొద్దని ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే పూజలు మరియు నమ్మకాలు కలిగిన బాలయ్య… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి టిడిపి పార్టీకి బ్యాడ్ టైం నడుస్తుంది అని పార్టీ పెద్దలకు చెప్పినట్టు టాక్ వినపడుతోంది. ఈ నెల 18 తర్వాత కమిటీపై ప్రకటన చేస్తే బాగుంటుందని ఈ సూచన ఇచ్చినట్లు టాక్. జాతకాలు, జ్యోతిష్యం భాగ నమ్మే బాలయ్య గత కొంత కాలం నుండి పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులను కొంతమంది ఆధ్యాత్మిక గురువులకు తెలియజేసి, వారి సలహా తీసుకుని 18 వ తారీకు తర్వాత ప్రకటించే కమిటీకి సరికొత్త ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.