అమరావతి: తెలుగుదేశం పార్టీని 23 సంఖ్యా వదలడం లేదు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందింది. దీనిని ఏపీ సీఎం జగన్ దేవుడు రాసిన స్క్రిప్ట్గా పలుమార్లు అభివర్ణించాడు. తాజాగా తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీడీపీకి వచ్చిన ఓట్లను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లను పోలుస్తూ, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ వరప్రసాద్ పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్మయినికి 1,895 ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే 23 వస్తుందని, అన్నే సీట్లను ఏపీలో ఆ పార్టీ గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. ఇదో అద్భుతమని పేర్కొన్నారు. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని, “హుజూర్ నగర్ లో తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 1895. 1 8 9 5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి… ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23” అని పీవీపీ ట్వీట్ చేశారు.
Miracle number 23 demonstrates it’s dominant show ?
హుజూర్ నగర్ లో తెలుగుదేశం కి వచ్చిన ఓట్లు 1895. 1+8+9+5 = 23.
భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి
ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23.— PVP (@PrasadVPotluri) October 25, 2019
.