అమరావతి: భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై జోకులు వేయడానికి సిగ్గుగా లేదా అని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిని టిడిపి ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిని బుద్దా విమర్శించారు. వైసిపి చరిత్రలో సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు.
దొంగ దీక్షలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అనీ, దొంగ దీక్షలకు పేటెంట్ రైట్ వైసిపికే ఉన్నాయనీ ఆయన విమర్శించారు. దొంగ దీక్షల బెస్ట్ డైరెక్టర్గా విజయసాయిరెడ్డికి అవార్డు కూడా వచ్చిందని బుద్దా ఎద్దేవా చేశారు.
‘పెద్ద రోగంతో పోయిన వాడు మా నాన్న కోసమే పోయాడు అంటూ బుగ్గలు నిమరడం, బిల్డ్ అప్ సాంగ్స్, గ్రాఫిక్స్లో జనం, ఎసి బస్సులో మేత అంతా బహిరంగ రహస్యమే కదా’ సాయి రెడ్డి గారూ అంటూ బుద్దా ట్వీట్ చేశారు.