అమరావతి: పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి కొడుకులు కమీషన్లు తిన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేడు అన్న క్యాంటిన్లలో జరిగిన అవినీతిపై ట్వీట్ చేశారు.
203 అన్న క్యాంటిన్ల నిర్మాణంలో 53 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు విచారణలో తేలిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రెండు కాంట్రాక్ట్ సంస్థలతో వాటాలు మాట్లాడుకొని వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చదరపు అడుగుకు 4,500 రూపాయలు ఖర్చు అవుతుందా అని విజయసాయి రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి, కొడుకులు కమిషన్లు తిన్నారు. 203అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలింది. 2 కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకొని వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారు. చ.అడుగుకు రూ 4,500 ఖర్చవుతుందా @ncbn గారూ?@naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 6, 2019