ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా ఇప్పుడు కొత్తగా రాజకీయ అరంగ్రేటం ఏమీ చేయడం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. 2014,2017లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఒక సున్నా పక్కన మరో సున్నా తోడు అయ్యిందని వ్యంగోక్తి విసిరారు.
ప్రియాంకకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బిజిపి నేతలు పలు విమర్శలు చేశారు.
యుపి ముఖ్యమంత్రి యోగి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి ఒక సున్నాయే ఉంది, ఇప్పుడు మరో సున్నా జతకలిసినంత మాత్రాన వంద కాదని, ఎన్ని సున్నాలు కలిసినా సున్నాయే అవుతుందని యోగి అన్నారు.
ప్రియాంక ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు చిత్రించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇప్పుడు ఆమె రాజకీయ ప్రవేశం చేయడం వల్ల ఆ పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏమి ఉండదని యోగి పేర్కొన్నారు.