మొదటిలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్లు పరిస్థితులు కనబడ్డాయి. సీఎం గా జగన్ అడిగిన వెంటనే చాలావరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే తరుణంలో జగన్ కూడా కీలక విషయాలను పార్లమెంటులోనూ మరియు రాజ్య సభలో కేంద్ర ప్రభుత్వానికి అండగా సపోర్ట్ చేసిన పరిస్థితులు కూడా మొన్నటివరకు చోటు చేసుకున్నాయి. కానీ ఇటీవల పరిస్థితులు ఏమయ్యాయో తెలియదు గాని చాలా వరకు కేంద్రం జగన్ సర్కార్ ని టార్గెట్ చేసినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
విషయంలోకి వెళితే ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అదే విధంగా కొంత మంది కేంద్ర మంత్రులు జగన్ సర్కార్ ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు విషయంలో జగన్ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వెంటనే జగన్ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర చేత నిర్మలా సీతారామన్ కి విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో క్షుణ్ణంగా వివరణ ఇవ్వడం జరిగింది.
ఇదే తరుణంలో జగన్ సర్కార్ కేంద్రంలో ఉన్న అన్ని శాఖలకు ఒక్కసారిగా షాక్ ఇవ్వటానికి రెడీ అయినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతి శాఖకు చెందిన మంత్రి మరియు అదే శాఖకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేత ఓపెన్ గా ఏడాది పరిపాలనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న దాని విషయంలో సంబంధిత కేంద్ర శాఖ మంత్రికి వివరణ త్వరలో ఇవ్వనున్నారు అట. ఈ దెబ్బతో అసలు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం పై ఎలాంటి అవినీతి ఆరోపణలు ఇంకెప్పుడు చేయకుండా జగన్ స్ట్రాంగ్ మెసేజ్ ఏపీ మినిస్టర్స్ తో ఢిల్లీకి పెద్దలకి ఇప్పించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.