పేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే యూపీఐ మార్కెట్ లో దూసుకుపోతున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీయుం, అమెజాన్ లకు వాట్సాప్ గట్టి పోటీనివ్వనుంది. ఎన్ పీసీఐ డేటా ప్రకారం యూపీఐ లావాదేవీల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.
“సురక్షిత డిజిటల్ లావాదేవీల కొరకు ఎస్ బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకులతో కలిసి పని చేస్తున్నామని” వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మంగళవారం వర్చువల్ పేస్ బుక్ ఈవెంట్ లో తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేటున్ అఫ్ ఇండియాకి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టం ద్వారా యూజర్లు మని ట్రాన్స్ఫర్ చేయొచ్చని వాట్సాప్ తెలిపింది. ఇప్పుడు మనం వాట్సాప్ ద్వారా డబ్బులు ఎలా పంపాలో తెలుసుకుందాం.
మొదటగా దీని కోసం బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మీద వాట్సాప్ ఉండాలి. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా వాట్సాప్ లోకి వెళ్లి కుడివైపున ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ అనే ఆప్షన్ ని ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత బ్యాంకు అకౌంట్ చూపిస్తుంది. అక్కడ బ్యాంకు అకౌంట్ ఎంచుకోవాలి. మీ అకౌంట్ వేరిఫికేషన్ లో భాగంగా ఇప్పుడు ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయటంతో.. మీ యూపీఐ ఐడీ క్రియేట్ అవుతుంది. దీని తర్వాత మీరు ఎవరికైనా డబ్బులను పంపించవచ్చు. అయితే ఇక్కడ మనం పంపించాలి అనుకున్న వారికి కూడా వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే డబ్బులు పంపించటం సాధ్యమవుతుంది.