ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సేల్ 4 గంటల ముందుగానే అందుబాటులోకి రానుంది. ఈ సారి సేల్లో ఎస్బీఐ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. పేటీఎం వాలెట్, యూపీఐతో కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాస్ ఇస్తారు. డెబిట్ కార్డ్ ఈఎంఐలు, ఫ్లిప్కార్ట్ పేలేటర్ సదుపాయాలను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.
సేల్లో భాగంగా మొబైల్స్, టీవీలు, అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్, టాయ్స్, బేబీ కేర్, హోం అండ్ కిచెన్, ఫర్నిచర్ వస్తువులు, గ్రాసరీలు తదితర అనేక వస్తువులపై ఆకట్టునే ఆఫర్లు, రాయితీలను అందివ్వనున్నారు.
సేల్లో ఎల్జీ జీ8ఎక్స్, పోకో ఎం2, మోటో వన్ ఫ్యూషన్ ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్ ఫోన్లపై తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. అలాగే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు, ప్రీమియం ట్యాబ్లెట్లు, 4కె టీవీలు, స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, హెడ్ఫోన్స్, స్పీకర్లు, ల్యాప్టాప్లు, ఆలిన్ వన్ పీసీలు, గేమింగ్ ల్యాప్టాప్లపై రాయితీలను అందివ్వనున్నారు. ఇవే కాకుండా సేల్ సందర్భంగా అనేక ప్రత్యేక డీల్స్ను అప్పటికప్పుడు అందించేందుకు ఫ్లిప్కార్ట్ సిద్ధమవుతోంది.