ఏటీఎం అంటే అందరికీ తొందరగా గుర్తొచ్చేది డబ్బులు తీసుకుని ఏటీఎం. డబ్బులు ఎటిఎం ని చూసాం, వాటర్ ఏటీఎం లని కూడా చూశాం, కానీ మీరు ఎప్పుడైనా పాల ఏటీఎం గురించి విన్నారా? లేక చూశారా? అవును అవును డబ్బులు ఎటిఎం మాదిరిగానే పాల ఏటీఎం కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా పాల ఏటీఎంలను ప్రారంభించారు.. హైదరాబాద్ మహానగరంలో ఎల్బీనగర్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఈ పాల ఏటీఎంను ఏర్పాటు చేశారు.
ఈ పాల ఏటీఎం ని అందుబాటులోకి తేవడం వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు వారికి ఎప్పుడూ అవసరమైనప్పుడు ఏటీఎం కి వెళ్లి పాలను తీసుకునే సదుపాయం కల్పించారు. ఏటీఎం నుంచి మనకు ఎంత డబ్బు అవసరమైతే అంత ఎలా డ్రా చేస్తామో, ఇక్కడ కూడా మనకు అవసరమైన అన్ని పాలను తీసుకోవచ్చు. ఏటీఎం మిషన్ లో లీటరు, అర లీటరు, పావు లీటర్లను అందులో అమర్చారు.
మనకు ఎన్ని పాలు అవసరమైతే అన్ని పాలను ఆమిషన్ నుంచి తీసుకువెళ్ళవచ్చు. కానీ మనం తీసుకువెళ్లే పాలకు సరిపడా డబ్బులు చెల్లించి మరీ పాలను తీసుకువెళ్లాలి. ఎల్బీ నగర్ లోని హస్తినాపురం డివిజన్, హనుమాన్ చౌరస్తాలో ఈ పాల ఏటీఎం సదుపాయాన్ని కల్పించబడింది. వినియోగదారులు వారి అవసరానికి సరిపడా పాలను అక్కడి నుంచి తీసుకుని పాలకుసరిపడా డబ్బులను అక్కడే ఉన్నటువంటి సిబ్బందికి చెల్లించాలి.
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ పాల ఏటీఎంను శ్రీ గీత డైరీ చైర్మన్ లక్ష్మీనరసింహ గుప్త ఏర్పాటు చేశారు. ఈ పాల ఏటీఎం ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని డైరీ చైర్మన్ గుప్త తెలిపారు. పాల ఏటీఎంను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.