ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తోపాటు నోకియా కంపెనీ కలసి ఇప్పటికే స్మార్ట్ టీవీలను తయారు చేసి భారత్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కంపెనీలు నోకియా సిరీస్లో కొత్త స్మార్ట్ టీవీలను మంగళవారం విడుదల చేశాయి. ఇవి 32, 43, 50, 55, 65 ఇంచుల సైజుల్లో లభిస్తున్నాయి. 32 ఇంచుల టీవీలో హెచ్డీ డిస్ప్లే వస్తుంది. 43 ఇంచుల సైజులో ఫుల్ హెచ్డీ, 4కె టీవీలు వస్తాయి. అలాగే 50, 55, 65 ఇంచుల్లో 4కె టీవీలు వస్తాయి.
ఈ టీవీలలో మాక్స్ బ్రైట్ డిస్ప్లే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్ వీటిలో ఉంటుంది. అందువల్ల ఆండ్రాయిడ్ యాప్స్ను ప్లే స్టోర్ నుంచి లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్రోమ్క్యాస్ట్ ను ఇన్బిల్ట్గా అందిస్తున్నారు. దీంతో ఫోన్ను టీవీలకు కనెక్ట్, మిర్రర్ చేయవచ్చు. ఈ టీవీలకు అందించే రిమోట్లపై జీ5, నెట్ఫ్లిక్స్ యాప్లకు హాట్ కీలను అందిస్తున్నారు. అందువల్ల నేరుగా ఆ కీలను ప్రెస్ చేయడం ద్వారా ఆయా యాప్లను ఈ టీవీలలో వేగంగా ఓపెన్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ను ఈ టీవీల్లో అందిస్తున్నారు.
* నోకియా 32 ఇంచుల హెచ్డీటీవీ ధర రూ.12,999
* నోకియా 43 ఇంచుల ఫుల్ హెచ్డీ టీవీ ధర రూ.22,999
* నోకియా 43 ఇంచుల 4కె టీవీ ధర రూ.28,999
* నోకియా 55 ఇంచుల 4కె టీవీ ధర రూ.39,999
* నోకియా 65 ఇంచుల 4కె టీవీ ధర రూ.59,999