మజ్జిగతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఇష్టం లేని వారు కూడా ఆ ప్రయోజనాల కోసం తాగి తీరుతారు. మజ్జిగ కేవలం ఎండాకాలమే కాదు.. సంవత్సరమంతా తాగవలిసిన పానీయం. మన పల్లెల్లో మజ్జిగను తాగుతారు లేదా అన్నం లో వేసుకుంటారు.
అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు.ఒకవేళ మీకు మజ్జిగ తాగడం ఇష్టం లేదనుకుందాం కానీ దాని ప్రయోజనాలు పొందాలి అనుకున్నపుడు అందులో ఉప్పు, జీలకర్రపొడి, పుదీనా, కొత్తిమీర ఆకులు, చాట్ మసాలా పొడి, అల్లం ముక్కలు, వేసి తాగారంటే… మళ్లీ మళ్లీ అలాగే తాగుతూ ఉంటారు. అసలు మజ్జిగ తాగడం వల్లఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
రక్తపోటు సమస్యతో బాధ పడుతున్నవారు ప్రతి రోజు ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది కాబట్టి రక్తపోటు ఉన్నవారు మాత్రమే మజ్జిగలో ఉప్పువేసుకోకూడదు.మిగతావారు మజ్జిగలో ఉప్పు వేసుకోవచ్చు.మజ్జిగ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోకలుపుకునే జీలకర్ర పొడి… జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియ బాగుండడం వలన మలబద్ధకం సమస్య తీరిపోతుంది వేడి చేసిన వారికి మజ్జిగ చలవ చేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు.
మజ్జిగ తాగితే చలవచేయడం తో పాటు కడుపు నొప్పి, గడబిడ ఇలాంటి పొట్టలో సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం దొరికినట్టే. మనం బయటి ఆహారాన్నితిన్నప్పుడు , గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు రావడం మాములే . అలాంటి వాటిని మజ్జిగ తగ్గిస్తుంది . అందుకే ఏం తిన్నా కూడా మజ్జిగ తాగే అలవాటు చేసుకోండి. మజ్జిగలో ప్రోటీన్స్ తో పాటు , కాల్షియం, విటమిన్ B, పొటాషియం ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచేవే.
మజ్జిగ తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అరస్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని త్రాగితే విరేచనాలు తగ్గుతాయి.