నేటి డిజిటల్ సమాజంలో స్మార్ట్ఫోన్ ఒక అవసరంగా మారింది. భారతదేశంలో టెలికాం రంగంలోనే అతిపెద్ద మెర్జింగ్ బ్రాండ్ ‘VI’ మరో పెద్ద కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్ గ్రూప్ తో జత కట్టింది. స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా ఉన్న మార్కెట్లో టెలికం వినియోగదారులకు ఉత్తమ సేవలు సరసమైన ధరలకు అందించేందు సిద్ధమైంది ‘VI’. రుణ మరియు పెట్టుబడి విభాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించింది ఈ సంస్థ. ఈ కలయికతో వినియోగదారులకు ఫైనాన్సింగ్, జీరో డౌన్ పేమెంట్ మరియు ఈజీ EMI లకు నూతన సౌకర్యాలను కల్పించింది VI- బజాజ్.
VI నెట్ వర్క్ బజాజ్ కంపెనీతో కలిసి కొత్త ఫోన్ తోనే ఒక సంవత్సరానికి సరిపడా రీఛార్జి పద్దతిని కూడా ఈఎంఐ పద్ధతి చెల్లించుకునే అవకాశాన్ని ప్రారంభించనుంది. స్మార్ట్ఫోన్ ధర మరియు రీఛార్జితో సహా మొత్తం బిల్ మొత్తాన్ని 6 నుండి 12 నెలవారీ వాయిదాలకు విభజించి EMI మొత్తాన్ని పొందవచ్చు అని సంస్థ తెలిపింది. వినియోగదారులు 6 నెలల కోసం రూ.1197 Vi ప్రీ-పెయిడ్ రీఛార్జిని ఎంచుకుంటే, కస్టమర్ చెల్లించాల్సిన EMI మొత్తం రూ.249 ఓపెన్ మార్కెట్ రీఛార్జిలకు బదులుగా రూ.200 మాత్రమే అవుతుంది. ఒకవేళ, ఒక కస్టమర్ 12 నెలల కాలానికి ఎంచుకుంటే కస్టమర్ చెల్లించాల్సిన EMI మొత్తం గణనీయమైన పొదుపు ఇస్తుందన్నారు. ఇక్కడ కస్టమర్ సరసమైన EMI లలో చెల్లించడం ద్వారా ఆదా చేయగల ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతాడు అని యాజమాన్యం సూచించింది.
ఈ భాగస్వామ్యం గురించి వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ “మా వినియోగదారులకు ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ పరిష్కారంతో పాటు వారికి నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనుక్కునేలా మరియు మంచి ఆఫర్ తో రీఛార్జ్ చేసుకునేల అనుమతిస్తున్నామన్నారు.