NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ గూటికి చేరిన బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి .. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్

బీఆర్ఎస్ నాయకురాలు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేయగా, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేరికలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా నేతలకు  సూచించిన మరుసటి రోజే మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు పలువురు నేతల చేరికకు చర్యలు తీసుకోవడం విశేషం.

BRS Jagtia ex municipal chairperson shravani joins bjp

 

బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనను అణిచివేశారని, తన ఎదుగుదలను ఓర్వలేకపోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా తనను బీఆర్ఎస్ అధిష్టానం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అయితే శ్రావణి చేరిక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హజరు కాలేదు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో వారు ఉండటం వల్ల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

BRS Jagtia ex municipal chairperson shravani joins bjp

 

బోగ శ్రావణి నెల రోజుల క్రితం జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే సంజయ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. బీసీ నాయకురాలినైన తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.  బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్లానని శ్రావణి అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినా బీఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోవడం, పార్టీ నేతలు ఎవరూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయడం గానీ, మద్దతుగా నిలవడం గానీ చేయకపోవడంతో పార్టీ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు.

గంజాయి కేసులో వైసీపీ రెబల్ నేత సుబ్బారావు.. బుక్ అయినట్లేనా..?

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju