CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆరోగ్యంగానే ఉన్నారనీ, గుండె సంబంధిత సమస్యలు ఏమి లేవని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సీఎం కేసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో యాదాద్రి పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో కేసిఆర్ కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. కేసిఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.
CM KCR: గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవు
ఏడమ చేయ్యి లాగుతుండటం, రెండు రోజులుగా బలహీనంగా(వీక్) ఉండటంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం కేసిఆర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదనీ కొద్ది సేపటిలో డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం. కేసిఆర్ వెంట భార్య, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఉప్పల్ పర్యటనలో ఉన్న కేసిఆర్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసిఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిసి పలువురు మంత్రులు యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.
షెడ్యుల్ ప్రకారం నేడు సీఎం కేసిఆర్ యదాద్రిలో పర్యటించాల్సి ఉంది. ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ పర్యటన రద్దు అయ్యింది.య దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి తిరు కల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హజరుకానున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!