Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఈ కారణంగా కేసిఆర్ యాదాద్రి పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో కేసిఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిప ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు పలు విషయాలు వెల్లడించారు. కేసిఆర్ ఏడమ చేయ్యి లాగుతుందని చెప్పారన్నారు. రెండు రోజులుగా ఆయన బలహీనంగా(వీక్) ఉన్నారని డాక్టర్ రావు చెప్పారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. కేసిఆర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన తెలిపారు. కేసిఆర్ వెంట భార్య, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఉప్పల్ పర్యటనలో ఉన్న కేసిఆర్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసిఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిసి పలువురు మంత్రులు యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.
Breaking: యాదాద్రి పర్యటన రద్దు
షెడ్యుల్ ప్రకారం సీఎం కేసిఆర్ నేడు యదాద్రిలో పర్యటించాలని అనుకున్నారు. ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ పర్యటన రద్దు అయ్యినట్లు తెలుస్తోంది. దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి తిరు కల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హజరుకానున్నట్లు సమాచారం. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.